కాంగ్రెస్ కు ’గుడ్ బై’..!!

Vijay-Kumar-vizag-north-mlaసీమాంధ్ర కాంగ్రెస్ ఎమెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ భై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర విభజన విషయంలో.. కేంద్రం ముందుకే వెళ్తుతున్న నేపథ్యంలో.. సీమాంధ్ర నేతలు తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అయ్యారు. తాజాగా, విశాఖ ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యే విజయకుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే, వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు విజయ కుమార్ రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాగా, ఇంకా చాలా మంది సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.