దీక్ష విరమించిన విజయమ్మ

vijayammaవైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిమ్స్ ఆస్పత్రిలో ఈ ఉదయం దీక్ష విరమించారు. సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, రైల్వే కోడూరుకు చెందిన రైతు వెంకటరామయ్యలు వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. విద్యుత్ ఛార్జీల పెరుగుదలను నిరసిస్తూ విజయమ్మ ఆధ్వర్యంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులో కరెంట్ సత్యాగ్రహం చేపట్టిన విషయం తెలిసిందే. దీక్ష విరమణ అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.