ప్రధాని.. దేశానికే భారం : వెంకయ్య

VENKAIAH_NAIDUప్రధాని మన్మోహన్ సింగ్ పై భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో వెంకయ్య విలేరులతో మాట్లాడుతూ.. ప్రధాని దేశానికే భారమయ్యాడంటూ వ్యాఖ్యానించాడు. కాగా, ముస్లిం యువకుల కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్న షిండే వ్యాఖ్యలపై కూడా వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు. షిండే వ్యాఖ్యలు ప్రజల్లో అపార్థాలకు దారితీస్తాయన్నారు. షిండే వ్యాఖ్యలు దేశాన్ని మతపరంగా విభజించే కుట్రగా వెంకయ్య పేర్కొన్నారు.