తెదేపాకు160పైగా సీట్లు – వెదురుపాక గాడ్ జోస్యం !

vedurupaka-swamiji-NCBNరాష్ర్టంలో ఈ ఏడాది ఆఖరులోనో, వచ్చే నెల ప్రారంభంలోనో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించబోతోంది. తన సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కాంగ్రెస్ పాలన లోపాల పట్ల వారిలో అవగాహన పెంచుతూ, పార్టీని విజయతీరం వైపు నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన పార్టీ 160కి పైగా సీట్లు గెల్చుకుంటుంది. ఆ జోస్యం చెబుతున్నది అల్లాటప్పా మనిషికాదు. తూర్పుగోదావరి జిల్లాలో వెదురుపాక స్వామీజీగా పేరొందిన, ‘గాడ్’ అని భక్తజనాలు పిలిచే శ్రీ విజయదుర్గా పీఠాధిపతి. అలా అని ఆయనకు రాజకీయాలు, ఇతరత్రా ప్రాపంచిక వ్యవహారాలను పట్టించుకుంటారంటే పొరపాటే. కానీ భవిష్యత్ దర్శనం మాత్రం కచ్చితంగా ఉంటుంది. అందుకే ఆయన మాటలను అందరూ నమ్ముతారు.

అటువంటి స్వామీజీ ఇటీవల కొందరు సినిమా ప్రముఖులు కలిసినప్పుడు, ఉన్నట్లుండి ఈ తరహా జోస్యం చెప్పారు. ఏ పార్టీతోనూ పెద్దగా సంబంధాలు లేని ఆ సినిమా ప్రముఖులు స్వామి మాటలు విని ఆశ్చర్యపోయారట. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం విధి నిర్ణయమని, అది బలీయమని స్వామిజీ వారికి వివరించారట. కనీసం 160 నుంచి 162 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ పై గెలుపొందుతారని కూడా ఆయన వివరించారట. భవిష్యత్ దర్శనం చేయగల స్వామీజీగా వెదురుపాక గాడ్ పై అపారమైన నమ్మకం కలిగిన భక్తులు ఆ మాటలు పూర్తిగా విశ్వసిస్తున్నారు.