వాద్రాపై చర్చకు విపక్షాల పట్టు !

lok sabhaకాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అక్రమాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. అయితే, ఎవరో ఒక వ్యక్తికి సంబంధించిన చర్చ వల్ల లోక్ సభ సమయాన్ని వృధా చేయరాదని కాంగ్రెస్ ఎంపీలు సూచించారు. వాద్రా కుంభకోణంపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడటంతో.. సభ వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలోనూ వాద్రా అక్రమాలపై చర్చించాలని ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో రాజ్యసభ మరోసారి వాయిదా పడింది.