ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా మత ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఈ మత ఘర్షణలు, అల్లర్లలో మరణించినవారి సంఖ్య 36కి చేరిందని అధికారులు తెలిపారు. జిల్లాలోని సివిల్ లైన్స్, కొత్వాలి, నైనీ మండి ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ ఘర్షణలకు సంభందించి ఇప్పటివరకు దాదాపు వెయ్యి మంది పై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 286 మంది ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.