తెలంగాణ ఉద్యోగుల సంఘం కార్యవర్గం అత్యవసరంగా సమావేశమై తెలంగాణ రాష్ట్రం ప్రకటించకపోతే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందనే నమ్మకం ఉందని అధ్యక్షుడు విఠల్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఈ నెల 28లోగా తెలంగాణ ప్రకటించకపోతే సమ్మెతప్పదని హెచ్చిరించారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ప్రకటించకపోతే ఎన్ని రోజులు సమ్మెచేయాలి, సమ్మెవిదివిధానలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. గతంలో టీఎన్జీవో సంఘం పిలుపు మేరకు సకలజనుల సమ్మె చేపట్టగా సమ్మె విజయవంతమైంది. కాగా ఇటువంటి సందర్బంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే అదే బాటలో నడువాలని టీఎన్జీవో సంఘం నిర్ణయం తీసుకుంది.