గతంలో హైదరాబాద్ అనే రాజ్యం ఉండేదని భారత దేశం ఏర్పాటు తరువాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా తెలుగు మాట్లాడేవారినందర్నీ కలిపి రాష్ట్రం చేశారని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో హైదరాబాద్ అసెంబ్లీలో చర్చ జరిగితే 140 మంది శాసన సభ్యుల్లో 102 మంది ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయాలన్నారనీ, వారి ఆమోదం మేరకే రాష్ట్రం ఏర్పాటైందని ఆయన స్పష్టం చేశారు.
మత హింస బిల్లు, మహిళా బిల్లు, తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడతారని తాను చదివానని, ఆ మూడు బిల్లులపై ఎన్డీయే ఏం సమాధానం చెబుతుందో తమతో పాటు ప్రజలు కూడా గమనిస్తారని ఆయన తెలిపారు.