తెలంగాణ అసెంబ్లీని, ఎమ్మెల్యేలను కించపరిచన టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎంఎస్ వోల నుంచి గట్టి వ్యతిరేకత ఎదురైంది. ఇవాళ్టి నుంచి ఈ రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఈ ఉదయం నుంచి టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు ఆగిపోయాయి.
ఈ రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు ఎం సుభాష్రెడ్డి ప్రకటించారు. ఎంఎస్ఓల సమావేశంలో ఈ రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.