నెహ్రూకు ఘన నివాళి

Jawaharlal-Nehruపండిట్ జవహర్ లాల్ నెహ్రూ 49వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు యమునా నదీ తీరాన ఉన్న నెహ్రూ సమాధి ‘శాంతివన్’ను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. భారతదేశ తొలి ప్రధానిగా… దేశాభివృద్ధిలో కీలపాత్ర పోషించిన నెహ్రూ వర్థంతి సందర్భంగా రాజకీయనేతలే కాకుండా సాధారణ ప్రజానీకం సైతం ఆయనకు
నివాళులు అర్పించారు.