ఓటుహక్కు వినియోగించుకున్న సెలబ్రిటీలు

tollywood-celebrities-cast-their-vote
తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు వేశారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఎన్టీఆర్ తో పాటు ఆయన తల్లి షాలిని కూడా ఓటు వేశారు. కేంద్ర మంత్రి చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్ ఓటు వేసారు. దర్శకుడు తేజ, ఆయన సతీమణి, రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి, కుమారుడు ఓటు హక్కు వేసుకున్నారు.