Site icon TeluguMirchi.com

‘ దేశం ‘ ఆఫీసుకు ‘ టు లెట్ ‘ బోర్డు

tolet-board-to-vizag-tdp-officeడిల్లీ అఖిలపక్ష సమావేశంలో తెలంగాణాకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర విద్యార్ధి ఐక్య కార్యాచరణ సమితి విశాఖపట్నం లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముట్టడించింది. కార్యాలయానికి ‘ టులెట్ ‘ బోర్డు పెట్టి తమ నిరసనను తెలియచేసారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వెంటనే తెలంగాణాకు సంబంధించి తమ అభిప్రాయాన్ని వెనక్కు తీసుకోవాలని, సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని విద్యార్ధులు డిమాండ్ చేసారు. చంద్రబాబును సీమాంధ్ర ద్రోహిగా వారు అభివర్ణించారు. బాబు చేస్తున్న ‘ వస్తున్నా మీకోసం ‘ యాత్రను సీమాంధ్ర జిల్లాల్లో అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. బాబు తనయుడు నారా లోకేష్ తెలంగాణాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విద్యార్ధులు ధ్వజమెత్తారు. కాగా టిడిపి తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడారి కిషోర్ తన పదవికి రాజీనామా చేసారు.

Exit mobile version