Site icon TeluguMirchi.com

తెలంగాణ పై.. టీ-జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం..!

Kodandaramతెలంగాణపై జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో.. నేడు ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి తెలంగాణకు మద్దతు పలికే అన్ని జాతీయ, పాంతీయ పార్టీలకు ఆహ్వానం పంపినట్లు జేఏసీ చైర్మెన్ ప్రొ. కోదండరాం తెలిపారు. అయితే, ఈ సమావేశంలో పార్టీ నేతలు తెలంగాణ పై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేంద్రం తెలంగాణ అంశాన్ని త్వరలో తేల్చాస్తామని చెబుతున్నప్పటికినీ.. తెలంగాణ బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టేవరకు కాంగ్రెస్ ను నమ్మేకూడదని జేఏసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకూ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ-తెరాస కలిసి కార్యచరణ చేస్తుందనేది బహిరంగ రహస్యమే. అయితే, ఢిల్లీ రౌండ్ టేబుల్ సమావేశం మాత్రం తెరాస మద్దతు లేకుండానే జేఏసీ ఈ ప్రయత్నానికి ఒడిగట్టడం రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేసింది.

Exit mobile version