మొదటి నుంచి హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న టీ-జేఏసీ, బీజేపీ, తెరాసలు మళ్లీ ఉద్యమ కార్యచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ’రాయల తెలంగాణ’ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటన వెలువడటమే తరువాయి.. తెలంగాణ మళ్లీ ఉద్యమ సెగలు ఎగసిపడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమాచారం.
ఇప్పటికే కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే.. వందరోజుల్లో హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో..ఆ పార్టీ రాయల ’టీ’ అంగీకరించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.ఏదేమైనా.. గతకొద్ది కాలంగా కాస్త ప్రశాతంగా వున్న తెలంగాణలో.. రాయల ’టీ’ ప్రతిపాదన మళ్లీ ఉద్యమాలకు నాంది పలికేలా వుందని రాజకీయ విశ్లషకులు అభిప్రాయపడుతున్నారు.