డిగ్గీతో సమావేశమయిన జేఏసీ నేతలు !

digvijaysigతెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశమవుతూ.. బిజిబిజీగా ఉన్నారు. నిన్న జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన జేఏసీ నేతలు ఈరోజు (శుక్రవారం) సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం జేఏసీ చైర్మెన్ కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్ తో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించేంతవరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని దిగ్విజయ్ సింగ్ ను కోరామని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు. కాగా, జేఏసీ నేతలుకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.