డిల్లీని దిగ్బందం చేయాలి : టీజీ

TG-Venkatesh-addressing-Media-at-CLP-2పార్లమెంటులో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఏకమై.. డిల్లీ దిగ్బందం చేయడానికి సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు మంత్రి టీజీ వెంకటేష్. టీజీ ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోని కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా పార్టీ అదిష్టానాన్ని దిక్కరిస్తుంటే.. ఇతర పార్టీలు అయిన తెదేపా, వైకాపాలు కాంగ్రెస్ పై ఏమాత్రం ప్రభావం చూపడం లేదని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలు ఇవ్వడం వల్లనే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని టీజీ అన్నారు. ఇక మీదటనైనా.. అన్నిపార్టీలు ఒకే వేదికపైకి వచ్చి విభజనను అడ్డుకోవాలని ఆయన అన్నారు.