Site icon TeluguMirchi.com

ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత !

nirbaya-2ఐదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ.. ఢిల్లీలో ఆందోళనలు ఉద్దృతమవుతున్నాయి. నిర్భయ2 ఘటనపై ఈరోజు కూడా ఢిల్లీ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఆందోళనలు రోజురోజుకీ వుధృతం అవుతుండడంతో.. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మూడు మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేశారు. ఇండియాగేట్, రైజినా హిల్స్, రేస్ కోర్స్ ప్రాంతాలలోని మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేశారు. అలాగే పలు మెట్రో సర్వీసులను కూడా నిలిపివేశారు. మరోవైపు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version