ఇప్పటికైనా టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్రానికి లేఖ ఇవ్వాలని కోరారు. ఒక వేళ విభజిస్తే రాయలసీమ పరిస్థితేంటో తెలుసుకోవాలని సీఎంను కోరినట్టు తెలిపారు. విభజనే పరిష్కారమైతే 6 జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలను రాయలసీమలో కలపాలని కోరారు. తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని టీజీ స్పష్టం చేశారు.