విధ్వంసం జరగబోతుందట !

tg venkateshఅసెంబ్లీలో ఓటింగ్ జరిగితే విధ్వంసానికి దిగే అవకాశం ఉందని, ఓటింగ్ ముగిశాక తమపై దాడి జరిగే అవకాశం ఉన్నందున తమకు భద్రత కల్పించాలన్నారు మంత్రి టీజీ వెంకటేష్. దాడులకు పాల్పడే వారిపై ముందే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. బిల్లుపై ఏం జరిగినా కేంద్రమే చూసుకుంటుందని ధీమా వ్యక్తం చేసిన నేతలంతా, ఓటింగ్ అనే సరికి ఎందుకు భయపడిపోతున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. మరో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ ఓటింగ్ కోరటం ప్రతి సభ్యుడి హక్కు అన్నారు. ఓటింగ్ పెట్టాలని 159మంది సభ్యులు స్పీకర్ కు లేఖలు అందించామన్నారు.