Site icon TeluguMirchi.com

అలిపిరి పీఎస్‌ వద్ద ఉద్రిక్తత

Seemaసీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వెళ్లి పోవాలన్న కాంగ్రెస్‌నేత వి.హనుమంతరావుకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి గాంధీగిరి పద్ధతిలో నిరసన తెలియజేయాలనుకుంటే పోలీసులు లాఠీ చార్జి చేయడంపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ… ఆందోళనకారుల నిరసన కార్యక్రమం చేపట్టడంతో తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

వీహెచ్ కారు ఆపకుండా వెళ్లిపోతుంటే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కారుకు అడ్డంగా పడుకుంటే పోలీసులు విచక్షణ లేకుండా దాడి చేయడం అమానుషమని అంటున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై పోలీసుల లాఠీచార్జి కి నిరసనగా శాప్స్ నాయకులు ఆదివారం తిరుపతి బంద్‌కు పిలుపునిచ్చారు.

Exit mobile version