Site icon TeluguMirchi.com

ఎన్డీఏకి గుడ్ బై చెప్పేసిన టీడీపీ

ఎపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేయాలనే భావనలో ఉన్న టీడీపీ ఎట్టకేలకు సంచలన నిర్ణయమే తీసుకుంది.ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ బంధం తెంచేసుకుంది. బిజెపితో పొత్తుకి స్వస్తి పలికింది. విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తన పార్టీ మంత్రుల్ని వెనక్కి తీసుకున్న టీడీపీ తాజాగా ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో వైసేపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలోను, ఎంపీలు, పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లోను మాట్లాడారు. శుక్రవారం ప్రత్యేకంగా జరిగే తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించాక ఎన్డీఏతో తెగదెంపుల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి.

Exit mobile version