సెప్టెంబర్ 7న తెలంగాన సాధన ర్యాలీ !

Kodandaramsతెలంగాణ సాధన ర్యాలీని సెప్టెంబర్ 7న నిర్వహించనున్నట్లు టీ-రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొ. కోదండరాం వెల్లడించారు. సిటీ కాలేజీ నుంచి ఇందిరా పార్క్ వరకు తెలంగాన సాధన ర్యాలీ కొనసాగనున్నట్లు ఆయన అన్నారు. ర్యాలీ ముగిసిన అనంతరం ఇందిరాపార్క్ వద్ద భారీ సభ నిర్వహిస్తామని కూడా చేపట్టనున్నట్లు
కోదండరాం ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు (మంగళవారం) టీ ఎన్జీవో భవన్‌ లో జరిగిన టీ. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఆలస్యం అయ్యే కొద్ది పరిస్థితి విషమిస్తోందన్నారు. కాగా, సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ముల్కీ వారంగా ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు.