తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైంది !

chidambaramప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ఈరోజు (సోమవారం) రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. కొత్త రాష్ట్రాలకు సంబంధించి రాజ్యాంగంలో స్పష్టమైన విదివిధానాలున్నాయని ఆయన అన్నారు. అయితే, కొత్త రాష్ట్రాల ఏర్పాటు ముందు అనేక అంశాలు పరిష్కరించాల్సి వుందని.. ఆ అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తుందని చిద్దూ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ విధివిధానాలపై కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ ను రూపొందిస్తుందని చిదంబరం పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని సక్రమంగా నిర్వహించ లేకపోతుందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు విమర్శించారు.