టీ-మంత్రాంగం.. !

TELANGANAతెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యనేతలతో తెలంగాణ రాజకీయ జేఏసీ ఈరోజు (శనివారం) సమావేశం కానుంది. హైదరాబాదులోని మంత్రుల నివాస ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశంకానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. సీమాంధ్రలో రోజు రోజుకు ఉద్యమం జోరందుకుంటున్న నేపథ్యంలో.. టీ-మంత్రులు, సీనియర్ నేతలతో రాజకీయ జేఏసీ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ’ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్ లో త్వరగా ప్రవేశపెట్టడానికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యచరణపై కూడా నేతలు చర్చించనున్నట్లు సమాచారం.