సచివాలయ శంకుస్థాపనలో హైలైట్ వీరిద్దరి సంభాషణే..

గురువారం ఎర్రమంజిల్‌లో తెలంగాణ కొత్త సచివాలయం, అసెంబ్లీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్య క్రమానికి తెలంగాణ మంత్రులు , ఎమ్మెల్యేల లతో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. శంకుస్థాపన సందర్భంగా కేటీఆర్ – హరీష్ ల మధ్య జరిగిన సరదా సంభాషణ హైలైట్ అయ్యింది.

చిరునవ్వుతో ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత.. ‘బావ.. మళ్లీ కుదరదు.. ఇప్పుడే మన ఛాంబర్స్ చూసుకుందాం రా..’ అంటూ కేటీఆర్ హరీష్ రావుతో అన్నారు. దీనికి హరీష్ రావు నవ్వుతూ.. అంతే సరదాగా బదులిచ్చారు. బావ బామ్మర్దుల సంభాషణకు అక్కడే ఉన్న టీఆర్ఎస్ నేతల్లో నవ్వులు విరిశాయి.ఆ తర్వాత కేటీఆర్ కార్యకర్తలతో సెల్ఫీలు దిగగా.. హరీష్ రావు నాయకులతో మాట్లాడుతూ కనిపించారు.