కేటీఆర్ ఆ భోజనం తిన్నాడా..?

KTR-5rsతెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈరోజు బేగం పేట లో 5 రూపాయల భోజనం తిని ఆశ్చర్య పరిచాడు..నగరం లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పేద ప్రజలు, కార్మికుల కోసం 5 రూపాయలకే భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే వీటికి ‘అన్నపూర్ణ కేంద్రాలు’గా పేరు పెట్టి, వాటి సంఖ్యను 150కి పెంచారు.

దీంట్లో భాగంగా.. కేటీఆర్ ఇవాళ (ఏప్రిల్ 22) బేగంపేటలో ఒక అన్నపూర్ణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే 5 రూపాయల భోజనం రుచి చూశారు. తిన్న తర్వాత.. భోజనం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. పేదవారికి ఏం కావాలో వాటిని సమకూర్చడం లో తెరాస ప్రభుత్వం విజయం సాదిస్తుందని ప్రజలంతా అనుకుంటున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మరింత దగ్గరవుతుంది.ఇక మంత్రి కేటీఆర్ అయితే 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నాడు..