మరోవైపు టీ-మంత్రులు లేకుండానే జరిగిన కేబినేట్ మీటింగ్ ఓటాన్ అకౌంట్ కు ఆమోదముద్ర వేసింది. టీ-మంత్రులు కేబినేట్ మీటింగ్ కు హాజరుకాకపోవడంపై పీసీసీ ఛీప్ బొత్స ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఓటాన్ అకౌంట్ పై నిరసన తెలపడం సమజసం కాదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
విభజన విషయంలో.. నేతలు ఇప్పటికే ప్రాంతాల వారీగా విడిపోయారు. తాజాగా, కేబినెట్ భేటీని టీ-మంత్రులు భైకాట్ చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర రాజకీయాలు మరింత వేడేక్కాయి.