Site icon TeluguMirchi.com

Telangana : జూనియర్ అసిస్టెంట్ లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి


మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న జూనియర్ అసిస్టెంట్‌లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి కల్పించింది తెలంగాణ ప్రబుత్వం. జీవో 134 ద్వారా 33 మంది జూనియర్ అసిస్టెంట్‌లకు ఈ ప్రమోషన్లు అందించారు. సెక్రటేరియట్‌లో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాలను అందించారు.

ఈ సందర్భంగా నూతన ఈవోలు ఆనందభాష్పాలు రాల్చారు. దసరా పండుగ వారం రోజుల ముందుగా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు నూతన ఈవోలు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సురేఖ కొండా తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులను అణచివేయడం జరిగిందని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇప్పటికే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈవోలుగా పలువురికి ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి కొండా సురేఖ. అంతేకాక, దేవాలయాల ప్రగతికి, వాటి ఆస్తుల పరిరక్షణకు ఉద్యోగులు పునరంకితం కావాలని మంత్రి కోరారు.

Exit mobile version