Site icon TeluguMirchi.com

పాలమూరులో ’టీ-జైత్ర యాత్ర’

DKAruna-తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ’జైత్రయాత్రలు’ కొనసాగుతూనే వున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ లో తెలంగాణ జైత్ర యాత్ర సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి డీకే అరుణ తెలిపారు. ఈ సభ ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలుపుతామని ఆమె అన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ జైత్రయాత్రలో పాల్గొననున్నారు. అయితే, జైత్రయాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు భారీ ఎత్తున తరలిరావాలని అరుణ కోరారు. కాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని వచ్చే సాధారణ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని అరుణ అధిష్టానానికి విజ్ఞప్తిని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ సభపై అధిష్టాన పెద్దలు సైతం దృష్టి సారించినట్లు సమాచారం.

Exit mobile version