అది శిలా శాసనం !

jaipal reddyహైదరాబాద్ తెలంగాణ లో అంతర్భాగమేనని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో రంజాన్ వేడుకలో పాల్గొన్న జైపాల్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణపై అధిష్టానం తీసుకున్ననిర్ణయం శిలా శాసనమని అన్నారు. విభజన విషయంలో సమయంలో తలెత్తె.. నదీ జలాల పంపిణీని అంతర్ రాష్ట్ర నదీజలాల బోర్డ్ చూసుకుంటుందని తెలిపారు. అదేవిధంగా.. తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. సీమాంధ్రలో ఆందోళనకు అక్కడి నేతలే కారణమని జైపాల్ ఆరోపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. తెలంగాణ విషయంపై కేంద్రం వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.