ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ఇరు ప్రాంత నేతలు హస్తినాలో హల్ చల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఇరుప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా గుమిగూడారు. ఎవరికి తోచిన లాబీయింగ్ లలో వాళ్లు మునిగిపోయారు. విభజనను ఆపడానికి కొందరు, పూర్తి చేయడానికి మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుకు తోసేవాడు ఒకడైతే.. వెనక్కు లాగేవాడు మరొకడులా తయారైంది టీ-బిల్లు పరిస్థితి.
ఇదిలా వుండగా.. పార్లమెంట్ సమావేశాలు రానే వచ్చాయి. నేటి (బుధవారం) నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ సమావేశాలను ప్రధానంగా తెలంగాణ అంశమే కుదిపేయనున్నట్లు తెలుస్తోంది. సందులో సడేమియా అన్నట్లు జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ మౌనదీక్ష ఒకటి. ఈ నేపథ్యంలో.. మరోసారి దేశ రాజధాని న’గరం గరం’ మారడం ఖాయంగా కనిపిస్తోంది.