విభజన బిల్లు @ శాసనసభ

Telangana bill yet to reach Andhra Pradesh Assemblyఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాష్ట్ర శాసన సభకు చేరింది. కేంద్ర హొంశాఖ సంయుక్త కార్యదర్శి సురేష్ కుమార్ బిల్లు ప్రతిని శాసనసభా కార్యదర్శి సదారాం కు అందజేశారు. అంతకు ముందు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ బిల్లు ప్రతులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతికి అందజేశారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్ లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.