Site icon TeluguMirchi.com

ఢిల్లీకి టీ-బిల్లు!

t-billరాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చపై నివేదిక నేడు ఢిల్లీకి చేరనుంది. గత మూడురోజుల కసరత్తు అనంతరం సమగ్ర నివేదిక రూపొందింది. ఆదివారం రాత్రి నివేదిక సిద్దమైంది. సోమవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో నివేదిక ఢిల్లీ చేరనుంది. నివేదిక క్రోడికరణ సారాంశాన్ని సీఎస్ మహంత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందజేశారు. దానికి సీఎం ఆదివారం రాత్రి ఆమోదం తెలిపారు. మరోవైపు, నివేదిక గురించి కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు ఆరా తీసింది. కేంద్ర ఉన్నతాధికారులు సీఎస్ తో పలుమార్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. పకడబంధీగా నివేదికను ఢిల్లీకి చేర్చనున్నారు. ఇక, టీ-గోడవ ఢిల్లీ చేరడంతో.. నేతలు సైతం ఢిల్లీ బాటపట్టారు.

Exit mobile version