తెలంగాణ ముసాయిదా రెడీ.. !

telangana billరాష్ట్ర విభజనపై వడివడిగా అడుగులు వేస్తున్న కేంద్రం కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. గత కొద్ది రోజులుగా హోంశాఖ కార్యదర్శులతో తరచుగా సమావేశమవుతున్న కేంద్ర మంత్రులు షిండే, జైరాం రమేష్ ఈరోజు కూడా మరోసారి భేటీ అయ్యారు. దీంతో.. సమావేశాల పరంపరం ముగిసిందని తెలుస్తోంది. అంతేకాకుండా.. విభజనపై కేంద్ర హోంశాఖాధికారులు ఓ ముసాయిదాను తయారు చేసినట్టు సమాచారం. రేపు చివరిసారిగా భేటీ అవనున్న జీవోఎం ముందుకు నివేదిక తుదిరూపం రానుంది. ఈ నివేదికను చూసి ఖరారు చేయడమే జీవోఎం ముందున్న ప్రక్రియ. నివేదికను జీవోఎం ఆమోదించిన తరువాత, కేబినెట్ ముందుకు దాన్ని ఎప్పుడు తీసుకురావాలనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం వుంది. మరోవైపు, కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మీ.. తదితరులు సమావేశమయ్యారు.