టీ-బిల్లు పార్లమెంట్ గడపదాటడంతో.. తెలంగాణలో సంబరాలు మిన్నంటాయి. ఇక మిగిలింది రాష్ట్రపతి సంతకమే. అది లాంచనమే. అపాయింటెడ్ తేది నుంచి రెండు రాష్ట్రాలూ మనగడలోనికి వస్తాయి. అయితే, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందగానే భాజాపా, తెరాస, టీ-టీడీపీ, కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. తెలంగాణ అంతటా పండగ వాతావరణం నెలకొంది.