రాజముద్ర

telangana1టీ-బిలుపై రాజముద్ర పడింది. పెద్దల సభ తెలంగాణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీంతో.. తెలంగాణ రాష్ట్రం దేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. గురువారం రాజ్యసభ ముజువాణి ఓటుతో టీ-బిల్లుకు ఆమోదముద్ర వేసింది. లోక్ సభలో ఎలాంటి చర్చ లేకుండా గట్టేక్కిన బిల్లు.. పెద్దల సభలో కాస్త పెద్ద ఎత్తునే చర్చ జరిగింది.

టీ-బిల్లు పార్లమెంట్ గడపదాటడంతో.. తెలంగాణలో సంబరాలు మిన్నంటాయి. ఇక మిగిలింది రాష్ట్రపతి సంతకమే. అది లాంచనమే. అపాయింటెడ్ తేది నుంచి రెండు రాష్ట్రాలూ మనగడలోనికి వస్తాయి. అయితే, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందగానే భాజాపా, తెరాస, టీ-టీడీపీ, కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. తెలంగాణ అంతటా పండగ వాతావరణం నెలకొంది.