బిల్లులో దాదాపు ఆరు సవరణ ప్రతిపాదనలకు జిఓఎం గ్రీన్ సిగ్నల్ ఇఛ్చే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి మూడు నుంచి వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణ బిల్లుపై జిఓఎం రోజువారీ సమావేశాలను నిర్వహించనుంది. ఫిబ్రవరి 14న హోంమంత్రి షిండే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు హోంమంత్రి షిండే., గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కమల్నాథ్ల మధ్య ప్రాథమిక చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 10లోపు జిఓఎం తుది నివేదికను కేంద్ర క్యాబినెట్కు సమర్పించనుంది. ఆ తర్వాత తుది బిల్లు రాష్ట్రపతికి చేరుతుంది. అక్కడ్నుంచి హోంశాఖ ద్వారా లోక్సభకు చేరనుంది. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్సులతో పాటు సీమాంధ్ర ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రాయం, కొత్త రాజధాని నిర్మాణానికి తగిన ఆర్ధిక సాయం వంటి అంశాలను బిల్లులో పొందుపరిచే అవకాశాలున్నాయి.