Site icon TeluguMirchi.com

వచ్చే సమావేశాల్లో టి బిల్లు : షిండే

shindeవచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ను ప్రవేశపెడతామని కేంద్ర హొంమంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే మతహింస నిరోధక బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నట్లు షిండే చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ను ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పంపిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై శాసనసభ అభిప్రాయాన్ని చెప్పేందుకు జనవరి 23 వరకు గడువు విదించారు.

Exit mobile version