సీమాంధ్ర మంత్రులు చేసిన డిమాండ్లలో హైదరాబాద్ ను యూటీ చేయడం, భద్రాచలంలోని పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడం, రాయల తెలంగాణ, 10సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్ ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన ఇరు ప్రాంతాలకు పంచడం.. మొదలైనవి. అయితే, పై డిమాండ్లపై ఏ ఒక్కదానికి జీవోఎం సభ్యుల నుంచి సానుకూల స్పందన రానట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈరోజు (గురువారం) సీమాంధ్ర మంత్రులతో మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయి.
జీవోఎం కసరత్తు ఇంకా కొద్దిగా మిగిలివుందని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే పేర్కొన్నారు. జీవోఎం ఆఖరి కసరత్తు, సీమాంధ్ర మంత్రుల బుజ్జగింపు.. తదితర పరిణామాలు నేడు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈరోజు సాయంత్రం జరిగే కేంద్ర కేబినేట్ ముందుకు టీ-బిల్లు రావడం కష్టంగానే కనిపిస్తుంది. మరోవైపు, కేబినేట్ ముందుకు టీ-బిల్లు టేబుల్ ఐటమ్ గా రావచ్చనే ప్రచారం జరుగుతోంది. మరీ.. ఈరోజు జరిగే కేబినేట్ ముందుకు టీ-బిల్లు వస్తుందా.. ? రాదా?? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.