రేపు తెలంగాణ బంద్

telangana bandతెలంగాణపై కేంద్రం వైఖరికి నిరసనగా రేపు (శనివారం) తెలంగాణ బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెరాస అధినేత కే. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణపై కేంద్ర వైఖరిని తప్పుబట్టారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… అఖిల పక్ష భేటీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. అన్ని పార్టీలు పాత పాటే పాడాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.