Site icon TeluguMirchi.com

తెలంగాణ బంద్.. !!

telangana-bandh-టీ-బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సమయంలో కూడా తెలంగాణలో నిరసనలు కొనసాగుతూనే వున్నాయి. ఆంక్షలు లేని తెలంగాణ కావాలని కోరుతూ.. పలు ప్రజాసంఘాలు నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేయడం, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం, భద్రాచలం 7మండలాలను సీమాంధ్రలో కలపడం, గవర్నర్ కు ప్రత్యేక అధికారలు.. తదితర అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రజాసంఘాలు పేర్కొన్నాయి. కాగా, నేటి తెలంగాణ బంద్ తో ఉస్మానియా యూనివర్సిటిలో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

Exit mobile version