సమైక్యవాదులు సీమాంధ్ర ప్రజాప్రతినిధులను అడ్డుకోవడమే కాదు.. వారి ఇంటిని ముట్టడించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు (శనివారం) సీమాంధ్ర టీచర్స్ జేఏసీ నేతలు మంత్రి టీజీ వెంకటేష్ ఇంటిని ముట్టడించారు. మంత్రి టీజీ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు జేఏసీ నేతలు ప్రయత్నించడంతో.. సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో.. అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే, మంత్రి టీజీ తీరును నిరసిస్తూ.. ట్జీచర్స్ జేఏసీ నేతలు చిల్లర నాణేలను విసిరి విన్నూతనంగా అందోళన చేశారు. మరోవైపు తెదేపా ఎమ్మెల్యేలు కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ ఇళ్లను కూడా సమైక్యవాదులు ముట్టడించారు. ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి.. వాటిని ఆమోదింపజేసుకొని ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల తమ ప్రాంతంలో కాలు పెట్టనీయమని గట్టిగా హెచ్చరిస్తున్నారు.