Site icon TeluguMirchi.com

గుంటూరులో ‘గురూత్సవ్’ వేడుకలు!

ncbn
విద్యార్థులకు సరైన విద్యను అందిస్తే.. ప్రపంచాన్ని శాసించే స్ధాయికి చేరతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లాలో గురూత్సవ్ లో చంద్రబాబు పాల్గొన్నారు. తన గురువులైన మునిరెడ్డి, లక్ష్మణ్ రెడ్డిలను బాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా ముందందని గుర్తు చేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిశోర్‌బాబు, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులు ఈ వేడుకలకు పాల్గొన్నారు.

Exit mobile version