Site icon TeluguMirchi.com

ఉపాధ్యాయుల మెరుపు సమ్మె

teachersఈ నెల 21 అర్ధరాత్రి నుంచి ఉపాధ్యాయులు మెరుపు సమ్మెకు సిద్ధం కానున్నట్లు సమైక్యాంధ్ర ఉపాధ్యాయుల పోరాట సమితి ప్రకటించింది. ఆదివారం సమావేశమైన పదమూడు జిల్లాల సమైక్యాంధ్రా ఉపాధ్యాయ పోరాట సమితి సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21 నుండి సమ్మె చేస్తామని, 19న సిఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని ప్రకటించారు. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.

Exit mobile version