టీడీపీ చించేసింది.. వైకాపా కాల్చేసింది.. !

T-BILLటీ-బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. అసెంబ్లీలో ఉద్రిక్తపరిస్థితులను తలపిస్తున్నాయి. పార్టీ నేతలంతా.. ప్రాంతాల వారీగా విడిపోయి నినాదాలు చేస్తునారు. ఓ సమయంలో.. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 65పేజీలతో కూడిన టీ-బిల్లును స్వీకర్ కొద్ది సేపటి క్రితం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. అనంతరం సభ అరగంటపాటు వాయిదా పడింది. అయితే, వాయిదా సమయంలో.. అసెంబ్లీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీమాంధ్ర తెదేపా నేతలు టీ-బిల్లు ప్రతులను మీడియా పాయింట్ వద్ద చిప్పేశారు. ఏకంగా.. టీ-బిల్లు ప్రతులను కాల్చేశారు వైకాపా ఎమ్మెల్యేలు. మొత్తానికి అసెంబ్లీ ఆవరణ రణరంగంగా కనిపిస్తోంది.