అర్థరాత్రి దాక అసెంబ్లీలోనే.. !!

assemblyశాసనసభలో సీమాంధ్ర టీడీపీ, వైయస్సార్‌సీపీ ఎమ్మేల్యేలు చేపట్టిన దీక్షను అర్ధరాత్రి మార్షల్స్‌ భగ్నం చేశారు. విభజన బిల్లును ప్రవేశపెట్టిన తీరుకు నిరసనగా తెదేపా, బిల్లు పెట్టినందుకు నిరసనగా వైకాపా ఎమ్మెల్యేలు అర్థరాత్రి దాక అసెంబ్లీలోనే భైఠాయించారు. సభాపతి తీరుకు, బీసీఏ సమావేశం నిర్వహించకుండానే సభలో బిల్లును ప్రవేశపట్టడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అర్థరాత్రి అయిన అసెంబ్లీని వీడకపోవడంతో.. స్వీకర్ అనుమతితో మార్షల్స్ వారిని స్పీకర్‌ ఛాంబర్‌ ఎదుట నుంచి సీమాంధ్ర ఎమ్మెల్యేలను అసెంబ్లీ భయటకి తీసుకువచ్చారు.