Site icon TeluguMirchi.com

ఎన్డీయేలో టీడీపీ.. ఇంకా ఉంది !

ఎన్డీయే భాగస్వామ్యం నుంచి టీడీపీ బయటికొచ్చినట్టే కనబడింది. బుధవారం అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ తర్వాత ఏపీలో చోటు చేసుకొన్న పరిణామాలు అలాగే కనిపించాయి. ఐతే, చివరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా తొగొట్టలేదు. కేవలం కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతున్న ఇద్దరు మంత్రులు గురువారం రాజీనామా చేయనున్నారని మాత్రమే తెలిపారు.

మంత్రుల రాజీనామాలు సరే.. ఎన్ డీయే నుంచి టీడీపీ బయటికొచ్చినట్టేనా ? అంటే ఇంకా ఆ నిర్ణయం తీసుకోలేదు. మంత్రుల రాజీనామాలపై భాజాపా అధిష్టానం ఎలా స్పందిస్తుంది ? అనేది చూద్దాం. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ పాత హిస్టరీని ఇంకాస్త కొత్తగా చెప్పారు సీఎం చంద్రబాబు. దీంతో.. ఎన్ డీయే తో టీడీపీకి ఇంకా చెడలేదు. కానీ, చెడేందుకు టైమొచ్చిందని అర్థమవుతోంది.. !

Exit mobile version