‘ఎన్టీయార్’ అందరివాడు..!

balaiah-Vs-Jr-NTRనందమూరి కుటుంబంలో ఫ్లెక్సీల చిచ్చు మరింత ముదిరింది. వైకాపా నేతలు తమ ఫ్లెక్సీలలో సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ ల చిత్రపటాలను వాడుతున్నా.. జూ.ఎన్టీఆర్ ఖండించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బాబాయ్ అబ్బాయ్ పై పెద్దఎత్తున మండిపడటం విశేషం !. అదేనండీ.. సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత బాలకృష్ణ ఫ్లెక్సీ వివాదంపై జూనియర్ వివరణ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బాబాయ్-అబ్బాయ్ మధ్య ఏర్పడిన ఈ తేల్చుకోవడాలు.. ఎటు మలుపు తిరుగుతుందోనని తెదేపా అభిమాన గళం, జూనియర్ అభిమానలు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా బాబాయ్ బాలకృష్ణ మాట్లాడుతూ.. “రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నాయకులు దిగవంత ఎన్టీఆర్ ఫోటోలను వాడడమే కాక, జూ. ఎన్టీఆర్ ఫోటోలను కూడా ఫ్లెక్సీలలో వాడుకోవడంపై మండిపడ్డారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. దీనిపై జూనియర్ ని వివరణ కోరతాను.. వివరణ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని” కాదని బాబాయ్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో.. క్రమ క్రమంగా తెదేపాలో లోకేష్ పాత్ర పెంచుతూ.. జూనియర్ కు స్వస్థీ చెప్పే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు !

మరోవైపు ఎన్టీఆర్ కూతురు, కేంద్ర మంత్రి పురంధశ్వేరి ఈ ఫ్లెక్సీ వివాదంపై మాట్లాడనంటూనే.. తన మనసులోని మాటలను బయటపెట్టారు. ’సీనియర్ ఎన్టీఆర్ ఏ ఒక్కరికీ చెందినవాడు కాదని.. ఆంధ్రపదేశ్ ప్రజలందరికీ చెందిన నాయకుడని అన్నారు’. అంటే.. తన తండ్రి ఫోటోను వైకాపా నేతలు ఉపయోగించుకోవడంలో.. తప్పులేదనదే..మంత్రి గారి మాట అన్నమాట!