Site icon TeluguMirchi.com

నేడే విశాఖలో ’తెదేపా ప్రజాగర్జన’

babu(1)విశాఖలో నేడు తెదేపా తలపెట్టిన ’ప్రజాగర్జన మహాగర్జన’కు ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12.30గంటలకు విశాఖ ఏయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా సభాస్థలికి చేరుకుంటారు. విశాఖ ప్రజాగర్జన వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, రమేష్, రమణ మూర్తి రాజు, వెంకట్రామయ్య.. తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, అవినీతి, కాంగ్రెస్ కుట్రలపై గత కొద్ది నెలలుగా తెదేపా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగర్జన సభలను నిర్వహిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.

Exit mobile version