Site icon TeluguMirchi.com

ఒంగోలు లో తెదేపా ప్రజాగర్జన!

tdp prajagarjanaకాంగ్రెస్ అవినీతి, కుట్ర రాజకీయాలపై తెదేపా ప్రజాగర్జన సభలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం తిరుపతిలో నిర్వహించిన సభకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చిందని తెలుగు తముళ్లు తెగ ఖుషి అవుతున్నారు. ఇది జనంలో వస్తున్న మార్పునకు, చైతన్యానికి నిదర్శనమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అంతేకాకుండా.. తిరుపతి సభలో తెదేపా అధినేత చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడిన తీరు పలువురిని ఆకర్శించిందని చెప్పుకొంటున్నారు. ఈ ఉత్సాహంతోనే.. తెదేపా శ్రేణులు మరో ప్రజాగర్జనకు సిద్దమవుతున్నారు.  ఈరోజు (సోమవారం) ఒంగోలులో మరో ’ప్రజాగర్జన సభ’ జరగనుంది. ఒంగోలులోని మినీ స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటల నుండి సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓంగోలు తెదేపా నేతలు చెబుతున్నారు.

Exit mobile version